అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్

68చూసినవారు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
రంగారెడ్డి జిల్లాలోని షాద్‌న‌గ‌ర్‌లో అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. క్షతగాత్రులను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించాలని కలెక్టర్‌కు ఆదేశమిచ్చారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాప‌క శాఖ‌, కార్మిక‌, పరిశ్రమల శాఖలు, వైద్య బృందాలు ఘ‌ట‌నా స్థలిలోనే ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కాగా, ఓ కంపెనీలో కంప్రెషర్‌ పేలడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

సంబంధిత పోస్ట్