రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హరీశ్ శంకర్ తెరకెక్కించగా.. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రీమియర్ షోలు ఒకరోజు ముందుగానే 14న వేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను సినీప్రియులతో పంచుకుంది. ఈ చిత్రంలో రవితేజ ఐటీ అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.