ఇటీవల ఉబర్ ఇండియాకు ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్- చండీగఢ్’ రూ.28,000 జరిమానా విధించింది. పంజాబ్కు చెందిన రిత్విక్గార్గ్.. 2022 సెప్టెంబరు 19న చండీగఢ్లో క్యాబ్ బుక్ చేసుకున్నారు. యాప్లో ఛార్జీ రూ.53గా చూపించినా డ్రైవర్ మాత్రం రూ.27 అదనంగా కలిపి రూ.80 వసూలు చేశాడు. దాంతో అతడు ఫిర్యాదు చేయగా..జరిమానా చెల్లించి, అదనంగా తీసుకున్న రూ.27తో పాటు మరో రూ.8,000 ఫిర్యాదుదారుకు చెల్లించాలని కమిషన్ తెలిపింది.