దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 22,044 వద్దకు చేరింది. సెన్సెక్స్ 454 పాయింట్లు దిగజారి 72,488 వద్దకు చేరింది. భారతీ ఎయిర్టెల్, పవర్గ్రిడ్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టాటాస్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు మినహా మిగతావి నష్టాల్లోకి చేరుకున్నాయి. నెస్లే, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, NTPC భారీగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.