బీజేపీ కార్యకర్తను హత్య చేసిన మావోయిస్టులు!

77చూసినవారు
బీజేపీ కార్యకర్తను హత్య చేసిన మావోయిస్టులు!
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఫరస్‌గావ్ ఉప సర్పంచ్, బీజేపీ కార్యకర్త పంచమ్ దాస్ హత్యకు గురయ్యారు. పోలీసులకు సహకరించాడన్న కారణంతో మంగళవారం హత్య చేశాడు. కంకేర్‌ ఆపరేషన్‌లో 29 మంది నక్సల్స్‌ మృతి చెందిన కొన్ని గంటల తర్వాత ఈ హత్య జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 9 మంది బీజేపీ కార్యకర్తలను నక్సల్స్ హత్య చేశారు.

సంబంధిత పోస్ట్