ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఫరస్గావ్ ఉప సర్పంచ్,
బీజేపీ కార్యకర్త పంచమ్ దాస్ హత్యకు గురయ్యారు. పోలీసులకు సహకరించాడన్న కారణంతో మంగళవారం హత్య చేశాడు. కంకేర్ ఆపరేషన్లో 29 మంది నక్సల్స్ మృతి చెందిన కొన్ని గంటల తర్వాత ఈ హత్య జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 9 మంది
బీజేపీ కార్యకర్తలను నక్సల్స్ హత్య చేశారు.