తెలంగాణ రాష్ట్రంలో 4,700 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1381 స్కూళ్లు.. 200 మంది విద్యార్థులకు మించి ఉన్నాయి. ఇంత ఆదరణ ఉన్నా తగినంత మంది ఉపాధ్యాయులను నియమించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు మండలాల్లోని హైస్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఉపాధ్యాయుల కొరత కారణంగా కొన్నిచోట్ల విద్యార్థులను చేర్చుకోలేని పరిస్థితి ఉందని హెచ్ఎంలు వాపోతున్నారు.