న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో తమ జట్టుకు పాకిస్థాన్ సెలక్టర్లు కోచ్గా వ్యవహరించనున్నారు. మహమ్మద్ యూసుఫ్, అబ్దుల్ రజాక్ తాత్కాలిక హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్గా సేవలు అందించనున్నారు. డబ్ల్యూసీ నుంచి పాక్ జట్టు కోచ్ లేకుండానే మ్యాచ్లు ఆడుతోంది. ఇటీవల కొందరి పేర్లను పరిశీలించినా వారు ఆసక్తి చూపలేదు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జాసన్ గిల్లెస్పీ, సౌతాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్స్టన్ పేర్లను పీసీబీ పరిశీలిస్తోంది.