రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉంటే ఆర్సీబీ టైటిల్ గెలుస్తుంది: మహ్మద్‌ కైఫ్‌

62చూసినవారు
రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉంటే ఆర్సీబీ టైటిల్ గెలుస్తుంది: మహ్మద్‌ కైఫ్‌
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా మాత్రమే ఆడాలని భారత మాజీ క్రికెటర్ మహ్మద్‌ కైఫ్‌ సూచించాడు. ఐపీఎల్‌ 2025 సీజన్‌లో రోహిత్ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున ఆడేలా ఆర్సీబీ అతడిని ఒప్పించి కెప్టెన్‌గా నియమించాలని కైఫ్‌ కోరాడు. రోహిత్‌ను తీసుకుంటే ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. 2011 నుంచి ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఆడుతున్న హిట్‌మ్యాన్‌ జట్టుకు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్