స్వాతంత్య్రం వచ్చిన తరవాత గ్రామీణ స్వావలంబన దిశగా అడుగులు వేయాలని గాంధీజీ కలలు కన్నారు. దేశ సమగ్రాభివృద్ధిలో పల్లెలు కీలక భూమిక పోషిస్తున్నాయి. జీడీపీలో వ్యవసాయం వాటా 19.9శాతం. సగానికి పైగా శ్రామిక జనాభా వ్యవసాయంలోనే ఉపాధి పొందుతోంది. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన పల్లెల్లో పేదరికం, నిరక్షరాస్యత, పోషకాహార లోపాలు, నిరుద్యోగం, మౌలిక సదుపాయాల కొరత తాండవిస్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే పంచాయతీలను బలోపేతం చేయాలి.