పానీపూరి అమ్మే వ్యక్తి కూతురికి టెన్త్ లో 99.72% స్కోర్

67చూసినవారు
పానీపూరి అమ్మే వ్యక్తి కూతురికి టెన్త్ లో 99.72% స్కోర్
గుజరాత్‌లోని వడోదరకు చెందిన పానీపూరీ విక్రేత కుమార్తె పూనమ్ కుష్వాహా అనే బాలిక పదో తరగతి ఫలితాల్లో 99.72% స్కోర్ సాధించి శభాష్ అనిపించుకుంది. ఆమె తండ్రి ప్రకాశ్ కుష్వాహా గత 25 ఏళ్లుగా వడోదరలో పానీపూరి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పూనమ్ వ్యాపారంలో తండ్రికి, ఇంటి పనుల్లో తల్లికి సాయపడుతూ చదువులోనూ రాణిస్తోంది. డాక్టర్ అవ్వడమే తన లక్ష్యమని చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్