అక్టోబర్ 24 నుంచి పూణే వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ లో కీపింగ్ చేస్తూ గాయపడ్డ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫిట్ గా ఉన్నాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్ చెట్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఒపెనర్ శుభ్ మన్ గిల్ కూడా ఫిట్ గా ఉన్నట్లు తెలిపారు. ఆరు స్థానాల కోసం ఏడుగురు పోటీ పడుతున్నట్లు ర్యాన్ టెన్ వెల్లడించారు.