సెన్సెక్స్‌ 930 పాయింట్లు ఢమాల్‌

82చూసినవారు
సెన్సెక్స్‌ 930 పాయింట్లు ఢమాల్‌
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇవాళ తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలతో ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.సెన్సెక్స్‌ ఏకంగా 930 పాయింట్లు పడిపోగా.. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా కుంగింది. సెన్సెక్స్‌ ఉదయం 81,155.08 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. చివరకు 930.55 పాయింట్ల నష్టంతో 80,220.72 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 24,445.80- 24,882.00 మధ్య కదలాడింది. 309 పాయింట్లు కోల్పోయి 24,472.10 వద్ద స్థిరపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్