విజయవాడ మెట్రోను అమరావతికి అనుసంధానించాలి: నారాయణ

67చూసినవారు
విజయవాడ మెట్రోను అమరావతికి అనుసంధానం చేయాలని మంత్రి నారాయణ కేంద్ర మంత్రిని కోరారు. కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ఇవాళ ఢిల్లీలో భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలకంగా చర్చించారు. విశాఖ, విజయవాడ మెట్రోపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని నారాయణ చెప్పగా, మెట్రో ప్రాజెక్టులపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఖట్టర్‌ చెప్పినట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్