పిజ్జా కోసం గొడవ.. మహిళపై కాల్పులు (వీడియో)

81చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిజ్జా విషయంలో గొడవ జరగడంతో ఓ మహిళపై కాల్పులు జరిగాయి. ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పిజ్జా పంపిణీ విషయంలో జరిగిన వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో మహిళ కడుపులో కాల్చారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్