జై శ్రీరామ్‌, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థులు పాస్‌!

81చూసినవారు
జై శ్రీరామ్‌, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థులు పాస్‌!
ఉత్తరప్రదేశ్‌లోని వీర్‌ బహదూర్‌ సింగ్‌ పుర్వాంచల్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ల నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. డీ ఫార్మసీ పరీక్షలో ‘జై శ్రీరామ్‌’ అనే నినాదాలు, క్రికెటర్ల పేర్లు రాసిన పలువురు విద్యార్థులను పాస్‌ చేశారు. ఇద్దరు విద్యార్థుల ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ బాగోతం బయటకు వచ్చింది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో ఇద్దరు ప్రొఫెసర్లను వీసీ తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్