ప్రధాని మోదీకి భయం పట్టుకుందని, వేదికపై కన్నీళ్లు పెట్టుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారు. శుక్రవారం కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు.”ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాని మోడీ యత్నిస్తుంటారు. కొన్ని సార్లు చైనా, పాకిస్థాన్ల గురించి మాట్లాడతారు. కొన్ని సార్లు మిమ్మల్ని పళ్లాలు మోగించమని అడుగుతారు. మీ మొబైల్ ఫోన్స్ల్లో టార్చ్లైట్ని ఆన్ చేయమని అడుగుతారు” అని అన్నారు.