కడుపునొప్పి భరించలేక రోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో జరిగింది. ఖమ్మం జిల్లా వై.లక్ష్మాపురానికి చెందిన అచ్చయ్య.. జనవరి 16న చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి వచ్చాడు. ఈ క్రమంలో కడుపునొప్పి భరించలేక ఆస్పత్రి భవనం రెండో అంతస్తు నుంచి దూకి, మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.