హైదరాబాద్‌లోని నిమ్స్‌లో రోగి ఆత్మహత్య

55చూసినవారు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో రోగి ఆత్మహత్య
కడుపునొప్పి భరించలేక రోగి ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్ప‌త్రిలో జ‌రిగింది. ఖమ్మం జిల్లా వై.లక్ష్మాపురానికి చెందిన అచ్చయ్య.. జనవరి 16న చికిత్స కోసం నిమ్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో కడుపునొప్పి భరించలేక ఆస్ప‌త్రి భ‌వ‌నం రెండో అంతస్తు నుంచి దూకి, మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్