కొడుకును మోడీకి ప‌రిచయం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

38217చూసినవారు
కొడుకును మోడీకి ప‌రిచయం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో జనసేన కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. NDA పక్ష నేతల సమావేశంలో పాల్గొనేందుకు సతీమణి అన్నా లెజ్నెవా, కొడుకు అకీరా నందన్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. సమావేశం అనంతరం.. తన సతీమణి, కొడుకు అకీరాను మోదీకి పరిచయం చేశారు. అనంత‌రం అకీరా మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్