ఏపీలోని టీడీపీ కూటమి తరపున పెమ్మసాని చంద్రశేఖర్కు.. కేంద్రమంత్రిగా అవకాశం దక్కింది. అమెరికా వెళ్లి వైద్యవిద్యలో పీజీ చేశారు. టీడీపీ ఎన్నారై విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనా చివరలో అవకాశం దక్కలేదు. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిత్వం దక్కించుకుని.. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యపై భారీ మెజారిటీతో గెలిచారు.