దేశంలోని ప్రజలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేశంలో ఉన్న అందరికీ త్వరలో పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అసంఘటిత రంగాలలో ఉన్న కార్మికులతో పాటు.. ప్రతి ఒక్కరికీ ‘యూనివర్సల్ పెన్షన్ స్కీమ్’ కింద కొత్త పెన్షన్ విధానం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ జీతం తీసుకునే వారి నుంచి, సొంత వ్యాపారం వారికి కూడా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.