బీఫ్తో చేసిన సమోసాలను వినియోగదారులకు విక్రయిస్తున్న వ్యక్తులను వడోదర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఓ షాపు నుంచి 113 కిలోల బీఫ్ను స్వాధీనం చేసుకున్నారు. దుకాణం హుస్సేనీ సమోసా సెంటర్ పానిగేట్ ప్రాంతంలో ఉంది. షాపు యజమానులతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. యజమానులు యూసుఫ్ షేక్, నయీమ్ షేక్లతో పాటు ఉద్యోగులను కటకటాల్లోకి పంపారు.