పోలీసు డ్రెస్ వేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన రాజు అనే వ్యక్తి గత కొద్దీరోజులుగా పోలీసు డ్రెస్ వేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఓ మొబైల్ దొంగతనం చేసి, మరో దొంగతనానికి పాల్పడుతుండగా గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.