‘భారత్‌లో విలీనం కావాలని పీఓకే ప్రజలు కోరుతున్నారు’

61చూసినవారు
‘భారత్‌లో విలీనం కావాలని పీఓకే ప్రజలు కోరుతున్నారు’
భారత్‌లో విలీనం కావాలని పాక్‌ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ప్రజలే కోరుకుంటున్నారని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. పీవోకే ప్రజలు భారత్‌లో విలీనం అవుతారనే విశ్వాసం తనకు ఉందన్నారు. ‘కశ్మీర్‌ను వాళ్లు ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా? పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గురించి వాళ్లు ఆందోళన చెందాలి. అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. భారత్‌లో విలీనం కావాలని పీవోకే ప్రజలే స్వయంగా డిమాండు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్