సుప్రీం కోర్టు భవనాన్ని కూల్చవద్దని కేంద్ర ప్రభుత్వంతోపాటు కోర్టు రిజిస్ట్రీకి
ఆదేశాలివ్వాలని కోరుతూ కేకే రమేష్ అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. భారీ కట్టడాన్ని కూల్చివేయకుండా వేరే చోట కొత్త భవనాన్ని నిర్మించాలని కోరారు. ‘‘ప్రస్తుతం 17 కోర్టు రూమ్లు, రెండు రిజస్ట్రీ రూమ్లు ఉన్నాయి. ఈ మొత్తం భవనాన్ని కూల్చివేసి రూ.800 కోట్లతో కొత్త భవనం నిర్మించాలని యోచిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.