ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ఓటుకు నోటు వ్యవహారం, 2022లో చోటు చేసుకున్న MLAలకు ఎర అంశం వెలుగు చూశాయి. ఇదే విషయాన్ని ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డి రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించారు. CM రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో ఉన్న ఓ ఇంట్లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.