తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో చేపట్టిన విచారణ ఈ నెల 11కు వాయిదా పడింది. ఈ కేసులో కీలక సూత్రదారులు ఐన అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు తమ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తమ కస్టడీ పూర్తి అయిందని, జ్యూడిషియల్ రిమాండ్లో ఉండి 2 నెలలు పూర్తయిందని పిటిషన్లో అడిషనల్ ఎస్పీలు పేర్కొన్నారు. కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కోరారు.