ఒడిశా రాష్ట్ర అటవీ శాఖాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుమతి లేకుండా వన్యప్రాణుల ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడానికి పలువురు జంతువులతో సెల్ఫీలు తీసుకుంటున్నారని, ఇది జంతువుల సహజ ప్రవర్తన, వాటి నివాస పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుతోందని తెలిపారు. అంతేకాకుండా ఇది 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమించడమేనని పేర్కొన్నారు.