AP: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసుల్లో సహజంగానే సీఎం ఫొటో ఉంటుంది. జనసేన అధినేత పవన్కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఫొటోలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు వెళ్లాయి.