యూపీలోని హాత్రాస్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనకు బాధ్యు లైన వారిపై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ గౌరవ్ ద్వివేది కోరారు. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు 121 మంది మరణించగా మరో 20 మందిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.