ఎడ్లబండిపై వెళ్లి పాఠశాలను తనిఖీ చేసిన పీవో

53చూసినవారు
ఎడ్లబండిపై వెళ్లి పాఠశాలను తనిఖీ చేసిన పీవో
కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలంలోని మారుమూల గ్రామం వెల్గీలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా మంగళవారం తనిఖీ చేశారు. సమీపంలోని వాగుపై వంతెన లేకపోవడంతో స్థానికులు ఎడ్లబండి సాయంతో పీవోను వాగు దాటించారు. పీవో పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్