దొంగలను అరెస్ట్ చేతయాల్సిన ఓ పోలీస్ నేరాలకు పాల్పడి అరెస్ట్ అయ్యారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. గతంలో ఓసారి ట్రాఫిక్ బాధ్యతలు నిర్వహించిన ఓ పోలీస్ ఆ నెపంతో వాహనాదారులను బెదిరించి డబ్బు వసూలు చేశాడు. ఈనెల 8న రాత్రి ఓ ట్రక్కు డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అతను పరారీకి యత్నించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.