వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

1085చూసినవారు
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కేంద్రం పై బంజారాహిల్స్ పోలీసులు రైడ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఓ మహిళ బ్యూటీ ప్లానెట్ స్పా పేరుతో శ్రీరాంనగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో మసాజ్ సెంటర్ నిర్వహిస్తోంది. డబ్బులకు ఆశపడి ఆమె యువతులతో వ్యభిచారం చేయిస్తోంది. పోలీసులు ఆ గృహంపై రైడ్ చేసి మేనేజర్ మహ్మద్ ఆదిల్ తో పాటు కస్టమర్ ను పట్టుకున్నారు. ముగ్గురు సెక్స్ వర్కర్లను రెస్క్యూ హోమ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్