రాముడి పేరుతో రాజకీయాలు చేయాలని చూసిన వారికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎన్సీపీ నేత శరద్ పవార్ విమర్శించారు. అయోధ్యలో బీజేపీ ఓటమి పాలైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ రామమందిరాన్ని ఎన్నికల అజెండాగా ఉపయోగించుకోవాలని అనుకుంది. కానీ దేశ ప్రజలు తెలివైనవారు. ఆలయం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని గ్రహించి.. బీజేపీకి 60 సీట్లు తగ్గించారు’’ అని పేర్కొన్నారు.