తెలంగాణలో ముగిసిన పోలింగ్

23936చూసినవారు
తెలంగాణలో ముగిసిన పోలింగ్
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. 17 లోక్ సభ, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తయింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణలో 61.16 శాతం పోలింగ్ నమోదైంది. తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటించాల్సి ఉంది. సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో 72.34 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ నియోజకవర్గంలో 39.17 శాతం ఓటింగ్ జరిగింది.

సంబంధిత పోస్ట్