టీడీపీ చేసిన సాయానికి చంద్రబాబుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి థాంక్స్ చెప్పారు. ఆయన గురువారం మాట్లాడుతూ..'119 నియోజకవర్గాల్లో
కాంగ్రెస్ నాయకులు ఆదమరిచి నిద్రపోయారేమో కానీ
టీడీపీ వారు మాత్రం నిద్రపోకుండా పనిచేశారు.
టీడీపీ వేరు
కాంగ్రెస్ వేరు కాదు.
టీడీపీ అధికారంలో లేదని ఎవరూ బాధ పడొద్దు. మీరు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోము. భవిష్యత్తు రాజకీయాల్లో కలిసి పని చేద్దాం' అని పొంగులేటి పిలుపునిచ్చారు.