దోపిడీ దొంగలు అవకాశం దొరికితే ఏది వదిలిపెట్టారు. విలువైన వస్తువులు, నగలు, నగదు ఇలా అన్నింటిని లూటీ చేసేస్తుంటారు. అలా నిత్యం కార్లు, బైక్లు చోరీకి గురవుతున్న సంఘటనలు సర్వసాధారణం. తాజాగా ఓ దొంగ కేవలం 10 సెకన్లలో ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన బైక్ను దొంగిలించాడు. ఈ బైక్ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ దొంగతనం పంజాబ్లోని ఫిరోజ్పూర్లో జరిగినట్లు సమాచారం.