ఉచిత ఇసుకతో పేదవాడి ఇంట పండుగ: ఎమ్మెల్యే బండారు

70చూసినవారు
ఉచిత ఇసుకతో పేదవాడి ఇంట పండుగ: ఎమ్మెల్యే బండారు
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఉచిత ఇసుక విధానం ప్రతి పేదవాడి ఇంట పండుగేనని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలంలోని మల్లాయిదొడ్డి ఇసుక స్టాక్‌ పాయింటుని సోమవారం ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి గనుల శాఖ అధికారులు మొత్తం 43 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్