మహిళలపై లైంగిక దౌర్జన్యం, బ్లాక్మెయిల్ ఆరోపణలతో కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణపైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారించేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా ఆమె అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్ ఘటనలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.