ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురిటి నొప్పులు.. డ్రైవర్‌ ఏం చేసాదంటే?

71చూసినవారు
KSRTCకి చెందిన ఓ బస్సు డ్రైవర్ చేసిన సాహసానికి నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. త్రిసూర్ నుంచి కోజికోడ్ వెళ్తున్న బస్సులో ఓ నిండు గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో బస్సు డ్రైవర్ డిపోకు సమాచారం అందించాడు. తర్వాత బస్సును త్రిసూర్‌లోని అమలా ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. వైద్యులు సమయాన్ని వృథా చేయకుండా బస్సులోనే ఆమెకు పురుడు పోశారు. ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా వారు క్షేమంగా ఉన్నారని తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్