ప్రపంచ జూనియర్ మహిళల అండర్-20 చెస్ చాంపియన్ షిప్లో విజేతగా దివ్య దేశ్ముఖ్ అవతరించింది. ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 18 ఏళ్ల దివ్య 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఆమె హంపీ, హారిక, సౌమ్య తర్వాత ప్రపంచ జూనియర్ బాలికల టైటిల్ను గెలుచుకున్న ఇండియన్గా నిలిచారు.