జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు.. ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు

63చూసినవారు
జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు.. ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయం, వైద్యం, సంస్కృతి, మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధ, వ్యవసాయం, విద్య రంగాల్లో సహకారంపై చర్చించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్