23న నామినేషన్‌ దాఖలు చేయనున్న ప్రియాంకా గాంధీ

63చూసినవారు
23న నామినేషన్‌ దాఖలు చేయనున్న ప్రియాంకా గాంధీ
కేరళలోని వయనాడ్‌లో జరగనున్న పార్లమెంటు ఉప ఎన్నికలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అభ్యర్థి ప్రియాంక గాంధీ అక్టోబర్ 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రియాంకతో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నేత, మాజీ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు ప్రియాంక, రాహుల్ రోడ్‌షో నిర్వహిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్