ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు

77చూసినవారు
ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు
మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. వారిని విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో జనవరి 5వ తేదీన సెషన్ కోర్టు సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారించింది. 90 శాతం వైకల్యమున్న సాయిబాబాకు జీవిత ఖైదు విధించింది.

సంబంధిత పోస్ట్