జైనూర్లో పోలీసులు నిషేధాజ్ఞలు అమలు చేశారు. జైనూరుతోపాటు ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మండలాల్లోనూ 144 సెక్షన్ విధించారు. పికెటింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. జైనూరు నుంచి ఆసిఫాబాద్, ఉట్నూరు వైపు ఎవరూ వెళ్లకుండా, జైనూరులో ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఆంక్షలను విధించారు. సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు మరో రెండు రోజులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని నిర్ణయించారు.