తెలంగాణలో టీడీపీ కేడర్ అయోమయంలో పడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీపై అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు తలోదారి చూసుకుంటున్నారు. ఏపీలో బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ తెలంగాణలో ఎలాంటి పొత్తు లేదని కిషన్ రెడ్డి ఇటీవల చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు నైరాశ్యంలో మునిగిపోయారు. దీంతో చాలా మంది రాజకీయ మనుగడ కోసం అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్లో పోటీకి దూరంగా ఉండనున్న విషయం తెలిసిందే.