రైతులు పల్లి వేసే ముందు భూసార పరీక్ష చేయించుకుంటే.. అందుకనుగుణంగా ఎరువులను వాడుకోవచ్చు. దుక్కిలో 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్పేట్, 33 కిలోల పొటాష్, 18 కిలోల యూరియాను విత్తనాలు వేసే సమయంలోనే వాడాలి. కలుపు గడ్డి నివారణకు విత్తనాలు విత్తిన వెంటనే లేదా 48 గంటల్లోపు అలాక్లోర్ 50 శాతం ఈసీ 1.5 నుంచి 2 లీటర్ల మందును 200 లీటర్ల నీటితో కలిపి దుక్కిపై పిచికారీ చేయాలి.