భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్ సాధించాడు. ఈ విషయాన్ని సుమిత్ శనివారం వెల్లడించాడు. మెన్స్ సింగిల్స్ ఈవెంట్లో అతను పోటీపడనున్నాడు. ప్రస్తుతం ఏటీపీ ర్యాంకింగ్స్లో సుమిత్ 71వ ర్యాంక్లో ఉన్నాడు. టాప్-56 మంది ప్లేయర్లు నేరుగా ఒలింపిక్స్కు అర్హత సాధిస్తారు. అయితే, ఒక దేశం నుంచి గరిష్టంగా నాలుగురు మాత్రమే పాల్గొనడానికి వీలు ఉండటంతో సుమిత్కు కలిసొచ్చింది.