ఈ ఏడాది పారిస్లో జరిగే ఒలింపిక్స్లో భారత అథ్లెట్లకు భోజన సమస్యలు తప్పనున్నాయి. అథ్లెట్ల విలేజ్లో మనవాళ్లకు బాస్మతి బియ్యంతో చేసిన అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ, గోబీ, కోడి కూర, పలుసులను అందించనున్నారని భారత డిప్యూటీ చెఫ్ డి మిషన్ శివ
కేశవన్ వెల్లడించారు. భారత అథ్లెట్లకు ప్రత్యేక ఆహారం కోసం ఇప్పటికే ఒలింపిక్స్ నిర్వాహకులకు భోజనాల లిస్ట్ పంపించామని తెలిపారు.