విశాఖ పట్నం జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డి పాలెంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వ్యాన్ ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 10 మందికి గాయాలు అయినట్లు తెలిసింది. క్షతగాత్రులను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.