పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. భాండాగారంలోని వస్తువులను తాత్కాలికంగా ఉంచేందుకు స్థలం గుర్తించినట్లు కమిటీ ఛైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ ప్రకటించారు. అయితే భాండాగారం ద్వారాలను నాగబంధనం చేసి మూసేశారని చెప్తుండటంతో ముందుజాగ్రత్తగా స్నేక్ క్యాచర్లను పిలిపించారు. భాండాగారంలో భారీగా బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది.